హుస్నాబాద్‌ రావాలంటేనే జంకుతున్న ప్రజలు

by  |
హుస్నాబాద్‌ రావాలంటేనే జంకుతున్న ప్రజలు
X

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం వైద్యులు 14 మందికి ఆర్డీటీ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారిని సౌమ్య తెలిపారు. ప్రస్తుతం హుస్నాబాద్ పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33కు చేరింది. నాలుగు జిల్లాల సరిహద్దు కలిగిన హుస్నాబాద్ ప్రాంతంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృభిస్తుండటంతో ఆ పట్టణానికి రావాలంటేనే గ్రామీణ ప్రాంత ప్రజలు జంకుతున్నారు.

Next Story

Most Viewed