మాజీ మంత్రితో రేవంత్‌రెడ్డి భేటీ.. ఆసక్తికరంగా చర్చలు..

by  |
pcc revanth
X

దిశ, మహేశ్వరం: తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ లోని మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ తో ఆయన నివాసంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేవేందర్ గౌడ్ కుమారులు తూళ్ల వీరేందర్ గౌడ్, విజేందర్ గౌడ్ రేవంత్ రెడ్డి కి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి వెంట మధుయాష్కీ గౌడ్, మల్లు రవి ఉన్నారు. దేవందర్ గౌడ్ తో భేటీలో ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed