‘ఆ హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు’

by  |
‘ఆ హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు’
X

దిశ,వెబ్‌డెస్క్: మంథని మండలంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. గుంజపడుగులో వామన్ రావు కుటుంబ సభ్యులను ఉత్తమ్ పరామర్శించారు. వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జంట హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి హత్యలను ప్రోత్సహిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ నేతలు భయపెడుతున్నారని చెప్పారు.


Next Story