కరెంట్ బిల్లులు యాప్ ద్వారా చెల్లించండి..

by  |
కరెంట్ బిల్లులు యాప్ ద్వారా చెల్లించండి..
X

దిశ, కంటోన్మెంట్ : సామాజిక మాధ్యమాలలోని యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లు చెల్లించవచ్చని బోయిన్‌పల్లి డివిజనల్ ఇంజనీర్ భిక్షపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 7 నుంచి 1 గంట వరకు సంబంధిత బిల్ కౌంటర్లో బిల్లు చెల్లించవచ్చన్నారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్ యాప్‌లు పేటీఎం, ఫోన్ పే, బిల్లు డెస్క్, టీ వాలెట్ వాటిల్లో బిల్లులు చెల్లించవచ్చు అని డివిజనల్ ఇంజనీర్ భిక్షపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, సకాలంలో కరెంటు బిల్లులు చెల్లించి అపరాధ రుసుములు లేకుండా చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story