జై అమరావతి అనలేను : పవన్

by  |
జై అమరావతి అనలేను : పవన్
X

ప్రధాని నరేంద్ర మోడీని, హోంశాఖ మంత్రి అమిత్ షాలను అపార్ధం చేసుకోవద్దు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. నేను జై అమరావతి అనలేనని నాకు రాష్ర్టం మొత్తం ఒక్కటే అని పవన్‌కళ్యాణ్ అన్నారు. ‘‘రాలయసీమలో జై కర్నూలు అనమంటారు, ఉత్తరాంధ్రలో జై ఉత్తరాంధ్ర అనమంటారు’’ అని ఇవన్నీ కాదని రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలూ ఒక్కటే అని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఉండాలని నేను ముందునుంచి చెప్తున్నా అని పవన్ స్పష్టం చేశారు. మిగిలిన రాజధాని అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపారు.

Next Story