అలాచేస్తే ఊరుకోం.. కాంగ్రెస్ నేతలకు పత్తి లక్ష్మణ్ వార్నింగ్

by  |
అలాచేస్తే ఊరుకోం.. కాంగ్రెస్ నేతలకు పత్తి లక్ష్మణ్ వార్నింగ్
X

దిశ, కోటగిరి: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుల పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని కోటగిరి మండల సర్పంచ్ ఫోరం కన్వీనర్ పత్తి లక్ష్మణ్.. కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులను ఘాటుగా హెచ్చరించారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజకీయ విలువలను విస్మరించి కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులు.. పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుల పైన చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామన్నారు. ఇక నుంచి ఇలాంటి దిగజారే మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Next Story

Most Viewed