ఎంజీఎంలో కరోనా పేషెంట్ల ఆందోళన!

by  |
ఎంజీఎంలో కరోనా పేషెంట్ల ఆందోళన!
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ ఎంజీఎం కోవిడ్ ఆస్పత్రిలో బాధితులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్, వైద్య సేవలు సరిగా అందడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వైద్యులపై కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వారు మెరుగైన వైద్య సేవలందించడంలేదని రోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు సరైన వైద్యం అందేలా చూడాలని రోగులు వేడుకుంటున్నారు. కాగా, గతకొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో వైద్యలు, సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.



Next Story