- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఓ రోగి శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం రామ్నాయక్ తండాకు చెందిన కాంబ్లే మాధవ్ వృత్తిరీత్యా కుటుంబంతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో నివసిస్తున్నాడు. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించగా అతడు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో అతన్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి ఈ నెల 18న రిఫర్ చేశారు. అదే రోజు అతడు రిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. వ్యాధి నయం కాదేమోనని మనస్తాపానికి గురై ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. గతంలోనూ ఇద్దరు రోగులు ఆస్పత్రి పైనుంచి దూకారు. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు కట్టదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు.