మైనర్లను చర్చికి పిలిచిన పాస్టర్.. ప్రార్థన పేరుతో పాడు పనులు

by  |
మైనర్లను చర్చికి పిలిచిన పాస్టర్.. ప్రార్థన పేరుతో పాడు పనులు
X

దిశ, వెబ్‌డెస్క్: చర్చిలో ప్రార్థన పేరుతో మైనర్లను దగ్గరకు తీసుకున్న పాస్టర్.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సమాజం తలదించుకునే ఈ ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామంలో ఓ చర్చిని నిర్వహించే పాస్టర్ ప్రసన్న కుమార్.. ప్రార్థనల కోసం వచ్చే మైనర్లపై కన్నేశాడు. ప్రేయర్ ముగిసిన తర్వాత పెద్దవాళ్లు వెళ్లిపోగానే.. మైనర్ల దగ్గరకు తీసుకునేవాడని.. ఈ క్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితులు తెలిపారు. ఇటీవల ఇద్దరు బాలికల పట్ల ఇదే విధంగా వ్యవహరించడంతో.. అతడి నిజస్వరూపం బయటపడింది.

ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ.. భర్త చనిపోగా, ఇద్దరు పిల్లలతో(మైనర్ బాలికలు) నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు కూలీ పని కోసం వెళ్లగా.. పిల్లలిద్దరూ చర్చిలో ప్రార్థనల కోసం వెళ్లారు. ఎవరూ లేని సమయం చూసిన పాస్టర్ ప్రసన్న కుమార్ వారిని దగ్గరకు తీసుకున్నాడు. సదరు మైనర్ల‌తో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ విషయాన్ని బాధిత బాలికలు తల్లికి చెప్పగా.. ఆమె నిలదీసింది. ఇదే సమయంలో విషయం బయటకి పొక్కకుండా పాస్టర్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. డబ్బుల ఆశ చూపి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, చివరకు పోలీసుల ఎంట్రీతో విషయం బట్టబయలైంది. దీనికితోడు పాస్టర్ ఆకృత్యాల వీడియోలు బయటకు రావడంతో పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు చాగలమర్రి పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed