తల్లి బతకాలని శవం ఎదుట పిల్లల ప్రార్థనలు..

by  |
తల్లి బతకాలని శవం ఎదుట పిల్లల ప్రార్థనలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : చనిపోయిన తమ తల్లి బతకాలంటూ పిల్లలు గత 22 రోజులుగా మృతదేహం వద్ద ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా నందవనవట్టి కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే… ఇందిరా మహిళ అనే దిండిగల్ జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ 7వ తేదీన మరణించింది. అయితే, ప్రార్థనలు చేస్తే ఇందిరా బతుకుతుందని పాస్టర్ సుదర్శన్ చెప్పడంతో 22 రోజులుగా తల్లి మృతదేహం వద్ద పిల్లలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు ఆరా తీయగా పాస్టర్ సుదర్శన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో పిల్లలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న మృతురాలి అక్క వాసుకితో పాటు పాస్టర్ సుదర్శన్‌లను అరెస్టు చేశారు.

Next Story