ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.

by  |
ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.
X

దిశ వెబ్ డెస్క్:
పార్లమెంట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. కరోనా నేపథ్యంలో షెడ్యూల్ కన్నా ముందే సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం సమావేశాలు అక్టోబర్ 1వరకు జరగాల్సిఉంది. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎనిమిది రోజుల ముందే సమావేశాలను ముగించారు. ఈ మేరకు రాజ్యసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు మధ్యాహ్నం వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ప్రకటన వెలుపడిన కొద్దిగంటల్లోనే లోక్ సభనూ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కాగా ఈ సమావేశాల్లో 25బిల్లులను లోక్ సభ ఆమోదించింది.

Next Story

Most Viewed