- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra )గత ఐదు సంవత్సరాల నుంచి తన వర్క్ పట్ల సంతోషంగా లేనని వెల్లడించింది. ఈ ఏడాది పరిణీతి మూడు సినిమాలు చేయగా.. ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. ఇక సైనా బయోపిక్తో పాటు ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ సినిమాలు పాండమిక్ సిచ్యువేషన్లోనే థియేటర్స్లో విడుదల కావడం వల్ల పెద్దగా ఆదరణ పొందలేకపోయినా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్పై ప్రేక్షకాదరణ పొందుతుండటం విశేషం.
కాగా తాజా ఇంటర్వ్యూలో కొన్ని సినిమాల్లో తను చేసిన సీన్ల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఐదేళ్లుగా నటించిన చాలా చిత్రాల్లో కంఫర్ట్ లేకుండా చేసిన పనుల పట్ల హ్యాపీగా లేను. నా సామర్థ్యాలపై నాకు నమ్మకమున్నా మేకర్స్ నుంచి అలాంటి ఆఫర్లు దక్కలేదు. ఈ క్రమంలో చాలా సినిమాలకు అర్ధాంగికారంతోనే సైన్ చేశా’ అని తెలిపింది. అయితే ఈ ఏడాది తను చేసిన చిత్రాల డైరెక్టర్స్ అమోల్ గుప్తా, దిబాకర్ బెనర్జీ, రిబు దాస్గుప్తాకు రుణపడి ఉంటానని చెప్పింది. కాగా 2011లో లేడీస్ వర్సెస్ రిక్కీ భల్ మూవీలో సపోర్టింగ్ రోల్తో ఎంట్రీ ఇచ్చిన పరిణీతి.. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘యానిమల్’ సినిమాలో రణ్బీర్ కపూర్ సరసన నటిస్తోంది.
- Tags
- Parineeti Chopra