- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తాను కార్గిల్లో అడుగుపెట్టినట్లు తెలుపుతూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య వెచ్చని భోగి మంటలను ఆస్వాదిస్తున్న పిక్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన అప్కమింగ్ ఫిల్మ్కు సంబంధించి నేపాల్ షెడ్యూల్ పూర్తవగానే కార్గిల్ చేరుకున్నట్లు తెలిపిన నటి.. నెక్ట్స్ ఫిల్మ్ను ఇక్కడే షూట్ చేయబోతున్నామని, ఇలాంటి ప్రదేశంలో తిరగాలనే తన కోరిక ఇంతటితో తీరిపోనుందని తెలిపింది. ఈ మేరకు తను పొందిన అనుభూతిని ప్రేక్షకులతో పంచుకుంటూ ‘ప్రస్తుతం నేను -12 డిగ్రీ సెల్సియస్ వాతావరణంలో ఉన్నాను. ఇది నాకు మరిచిపోలేని రోజు. మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్స్తో పాటు నదులు కూడా గడ్డకట్టుకుపోయాయి’ అని తెలిపింది.
ఈ క్రమంలో కళ్లు మూసుకుని చల్లటి గాలి, ప్రకృతిని ఆస్వాదిస్తున్న మరో పిక్ షేర్ చేస్తూ ‘నిజాయితీగా జీవించి, మరిచిపోలేని క్షణాలను జ్ఞాపకాలుగా పదిలపరుచుకోండి. ఎల్లప్పుడూ శాంతిని కొనసాగించండి. జీవితంలో ప్రతికూలతలను కలిగించే ప్రతీ ఒక్కరికి దూరంగా ఉండండి’ అంటూ అభిమానులను కోరింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరగా ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’లో అర్జున్ కపూర్తో కలిసి నటించింది.
ఆ పని చేసిన తొలి చైనా మహిళగా ‘వాంగ్ యాపింగ్’ రికార్డ్!
-4° ❄️ #SnowBurn pic.twitter.com/nzrfGMQOFv
— Parineeti Chopra (@ParineetiChopra) October 24, 2021