- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వేములవాడ : యువకుడిని హిజ్రాగా తయారు చేసేందుకు ప్రయత్నించిన హిజ్రాలకు యువకుడి తల్లిదండ్రులు, స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ముంజపల్లి గ్రామానికి చెందిన వంగ మహేశ్ అనే యువకుడు గత రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు.
ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన యువకుడి తల్లిదండ్రులు.. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. ఈ క్రమంలో వారు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో మహేశ్ వేములవాడలో ఉన్నట్లు తెలియడంతో.. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో హిజ్రా వేషంలో ఉన్న మహేశ్ను చూసి యువకుడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
అనంతరం మహేశ్ను తమ ఇంటికి వెళ్లాలని ప్రయత్నించగా.. హిజ్రాలు అడ్డుపడ్డారు. దీంతో, యువకుడి తల్లిదండ్రులు, స్థానికులు హిజ్రాలను చితకబాదారు. ఆ తర్వాత మహేశ్ను వారి వెంట తీసుకువెళ్లారు. అయితే, కొద్ది రోజులుగా వేములవాడ ప్రాంతంలో హిజ్రాలు హల్చల్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా వారి ఆగడాలను అరికట్టాలని ప్రజలు.. పోలీసులను కోరుతున్నారు.