పిచ్చికుక్కల స్వైర విహారం..

by  |
పిచ్చికుక్కల స్వైర విహారం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

హైదరాబాద్‌లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. లంగర్ హౌస్‌లోని ప్రశాంత్ నగర్‌లో గురువారం పిచ్చికుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పనితీరుపై చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సిబ్బంది నిర్వహణలోపం వల్లే ఇవాళ తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed