పంచాయతీ అధికారి సస్పెన్షన్..

by  |

దిశ, జనగామ: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పంచాయతీ అధికారి హరి ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ నిఖిల శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులలో భాగంగా ఆమె దేవరుప్పుల మండలంలోని వైకుంఠదామం‌, డంపింగ్ యార్డ్ నర్సరీ, తడి పొడిచెత్త షెడ్స్ నిర్మాణాల పనులను పరవేక్షించారు.‌ ఈ మేరకు దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, బంజారా,‌ చిన్నమడూర్ గ్రామాల్లో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని గుర్తించారు. దీనికి మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్‌ను బాధ్యున్ని చేస్తూ కలెక్టర్ సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

Next Story