- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మణుగూరు: పినపాక మండలం మల్లారం పంచాయితీలో పంచాయతీ కార్యాలయం దగ్ధమైన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ కార్యాలయానికి మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిప్పు అందించడంతో ప్రమాద ఘటన జరిగినట్లు తెలుస్తుంది. పంచాయతీ కార్యాలయం దగ్ధంపై స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో మందుబాబులు పంచాయతీ కార్యాలయానికి నిప్పు పెట్టవలసిన అవసరం ఏమి వచ్చినట్లు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ప్రమాదంపై స్థానిక సర్పంచ్ కొమరం రాధాబాయి బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రమాద ఘటనపై రాజకీయ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు అనుమానాలకు తెరలేపారు. పోలీసులు విచారణ చేపట్టి పంచాయతీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై నిజాలను వెలికితీసి నిగ్గు తేల్చాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.