Breaking: ముగిసిన ఐశ్వర్యరాయ్ ఈడీ విచారణ

by  |
Aishwarya Rai
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ ఈడీ విచారణ ముగిసింది. పనామా పేపర్ల లీకేజీ వ్యవహారంలో సోమవారం ఢిల్లీలోని ఈడీ అధికారుల ఎదుట ఆమె హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమెను విచారించి, స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, పనామా దేశానికి చెందిన మొసాక్‌ ఫోన్సెకా అనే కార్పొరేట్‌, న్యాయ సేవల సంస్థ పలు దేశాల్లో నెలకొల్పిన వేలాది డొల్ల కంపెనీల బాగోతాన్ని 2016లో ఐసీఐజే బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రముఖులపై కేసు నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, కార్పొరేట్‌, సినీ రంగానికి చెందిన వ్యక్తులు అక్రమ ధనాన్ని రహస్య ఖాతాల్లోకి మళ్ళించడానికి తోడ్పడ్డారని సంస్థ వెల్లడించింది. అందులో భాగంగా కేసుల పాలైన ఐశ్వర్యరాయ్, నేడు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైంది.

Next Story

Most Viewed