పుల్వామాపై కావాలనే ఇరికిస్తున్నారు : పాక్

by  |
పుల్వామాపై కావాలనే ఇరికిస్తున్నారు : పాక్
X

దిశ, వెబ్‌‌డెస్క్ :

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్‌లోని మసూద్ ఆజర్, అతని సోదురుడిపై NIA చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ స్పందించింది. పుల్వామా దాడి ఘటనలో పాక్‌ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ దేశం వింత వాదనకు దిగింది. చార్జిషీటులోని ఆధారాలు రుజువు చేయడంలో భారత్ ఘోరంగా విఫలమైందని తెలిపింది.

ఈ పరిణామం భారత్ సంకుచితత్వాన్ని సూచిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇలాంటి ఆరోపణలు తమపై చేస్తుందని పాక్ వెల్లడించింది.

Next Story

Most Viewed