కరోనా ప్రభావం.. పద్మ అవార్డులు వాయిదా

by  |
కరోనా ప్రభావం.. పద్మ అవార్డులు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రభావం మామూలుగా లేదు. ప్రతి విషయంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది కోవిడ్ 19. పబ్లిక్ ప్లేస్‌లో తిరగడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలు, మాల్స్, థియేటర్లు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా ప్రభావంతో పద్మ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. ఏప్రిల్ 3న రాష్ట్రపతి భవన్‌లో జరగాల్సిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే తదుపరి తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.

Tags: CoronaVirus, Covid19, Padma Awards, Postponed

Next Story

Most Viewed