ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తొలగింపు

by  |
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
X

దిశ, మహబూబ్‌నగర్: ఈ ఆపత్కాలంలో ప్రైవేటు యాజమాన్యాలు కార్మికులను తొలగించొద్దని చెబుతున్న ప్రభుత్వం.. తమ వద్దకు వచ్చేసరికి మాత్రం ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో ఉద్యానవనశాఖలో పనిచేస్తున్న 11మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించి, మే 1 నుంచి విధులకు హాజరుకావల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి సైతం సమాచారం అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ కాలంలో తమను ఉద్యోగాల నుంచి అర్ధాంతరంగా రోడ్డున పడేశారని, ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

Tags: Telangana, Parks, 11 Outsourcing Staff, Removal, Lockdown, Corona Virus



Next Story