స్టాఫ్ నర్సులకు జీతాలు చెల్లించాలి

by  |
స్టాఫ్ నర్సులకు జీతాలు చెల్లించాలి
X

దిశ, హైదరాబాద్: కొవిడ్-19 ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ నర్సింగ్ సమితి డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్మేటి గోవర్ధన్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. కొవిడ్-19 రోగులకు సేవలందించేందుకు ఔట్ సోర్సింగ్ విధానంలో 2,154 మంది స్టాఫ్ నర్సులను ఏప్రిల్ 28వ తేదీన విధుల్లో చేరారని తెలిపారు. అయితే నేటి వరకు వారికి వేతనాలు, నియాయక పత్రాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై డీఎంఈ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed