గెల్లు శ్రీనివాస్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఓయూ జేఏసీ

by  |
గెల్లు శ్రీనివాస్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఓయూ జేఏసీ
X

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబార్ ఉప ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం శ్రమిస్తామన్నారు ఓయూ జేఏసీ నేతలు. విద్యార్థి నాయకుడిని గెలిపించుకుందాం అన్న నినాదంతో తమ ప్రచారం సాగుతుందని వెల్లడించారు. లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి బీజేపీలో ఎందుకు చేరాడని ఓయూ జేఏసీ ప్రశ్నించింది. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. 11 యూనివర్సిటీల విద్యార్థి నాయకులు గెల్లు శ్రీను గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ అభివృద్ధి చెందాలంటే గెల్లు శ్రీనుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు రవీంద్రనాయక్, సీహెచ్ చైతన్య, అశోక్ గౌడ్, చిరంజీవి, నారాయణ, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed