ఓటీటీలోకి సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Disha Web Desk 6 |
ఓటీటీలోకి సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. దీనికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, ఊరు పేరు భైరవకోన డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ మార్చి 15న స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Next Story