నవదీప్ ‘న్యూసెన్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

by Disha Web Desk 23 |
నవదీప్ ‘న్యూసెన్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదీప్, బిందు మాధవి కలిసి నటించిన వెబ్‌ సిరీస్ ‘న్యూసెన్స్’. శ్రీ ప్రవణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి తాజాగా ఆసక్తికరమైన ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ఈ వెబ్ సిరీస్‌ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలిపారు. ఈ నెల 12న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా.. మీడియా రంగాన్ని ఉద్దేశించి సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేటి మీడియా డబ్బుకు ఎలా ప్రభావితమవుతుంది? రాజకీయాలకు ఎలా అమ్ముడుపోతుంది? అనేది ఇందులో చూపించినట్లు సమాచారం.

Also Read..

నయనతారపై షారుఖ్ కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed