- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’ స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచంటే?
దిశ, సినిమా: సిద్దు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ‘డిజే టిల్లు’కు సీక్వెల్గా వచ్చి హిట్ అయింది. మార్చి 29న విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్క్వేర్ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే రూ. 100 కోట్ల మార్క్ను దాటేసింది. దీంతో టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26 స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు టాక్. అంటే రిలీజ్ అయిన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తుందన్న మాట. దీంతో ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు సంతోషపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.