ఓటీటీలో విడుదలకు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. ఎప్పుడో తెలుసా?

by Disha Web Desk 6 |
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. ఎప్పుడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘ఓ మై గాడ్-2’. ఇందులో పంకజ్, త్రిపాఠి, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. దీనికి అమిత్ రాయ్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. 2012లో రూపొందిన ఓ మై గాడ్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ మూవీతోనే అక్షయ్‌కుమార్ తిరిగి విజ‌యాల బాట ప‌ట్టాడు. అయితే ఓ మై గాడ్-2 మూవీ విడుదల కాకముందే పలు వివాదాలు ఎదుర్కొంది.

‘ఓ మై గాడ్ 2’లో శివుడి పాత్రలో అక్షయ్‌కుమార్ క‌నిపించ‌డంపై కొన్ని వ‌ర్గాల వారు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రద‌ర్శన‌ను నిలిపివేయాలంటూ డిమాండ్‌ చేశారు. అలాగే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు కూడా నిరాకరించింది. దీని వల్ల చిత్రయూనిట్ పలు సీన్స్‌లో కూడా మార్పులు చేశారు. అన్ని వివాదాల నడుమ ఓమై గాడ్-2 ఆగస్ట్ 11న థియేటర్స్‌లో విడుదలైంది. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు టాక్. తాజాగా, ఈ వివాదాస్పద మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబ‌ర్ 8 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో అది చూసిన అక్షయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More: ‘హాయ్ నాన్న’ నుంచి క్యూట్ వీడియో రిలీజ్.. పాప మాటలకు ఫ్యాన్స్ ఫిదా


Next Story

Most Viewed