ఒర్లీన్స్ మాస్టర్స్‌లో సైనా శుభారంభం

by  |
ఒర్లీన్స్ మాస్టర్స్‌లో సైనా శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం పారీస్‌లో ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌కు చెందిన రేచెల్ డర్రాహ్‌పై 21-9, 21-5 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా.. ప్రత్యర్థిని కేవలం 21 నిమిషాల్లో చిత్తు చేసింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన సైనాకు ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడం తప్పక అవసరం. టోక్యో ఒలంపిక్స్ బెర్త్ కోసం సైనా తీవ్రంగా శ్రమిస్తున్నది.

క్వాలిఫయింగ్ కటాఫ్ తేదీ లోపు ఆమె 16వ ర్యాంకులోపు నిలవాల్సిన అవసరం ఉన్నది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌కు బై లభించింది. రెండో రౌండ్‌లో అజయ్ జయరామ్‌పై 21-15, 21-10 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్ చేరుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్, సిక్కి రెడ్డి జోడి ఆస్ట్రేలియాకు చెందిన స్టిప్‌సిట్స్, సెరేనాపై 21-7, 21-18 తేడాతో విజయం సాధించారు.


Next Story

Most Viewed