నిజామాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

by  |
నిజామాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
X

దిశ, నిజామాబాద్: వలస కూలీలను వదిలి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి వద్ద ఆరేంజ్ టూర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. వలస కూలీలను వదిలి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఎవరూ లేకపోవడంతే పెద్ద ప్రమాదం తప్పింది.


Next Story

Most Viewed