- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తామో చెప్పం: పాక్ విదేశాంగ్ర మంత్రి
పాక్ ఆక్రమిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లోని (PoK) ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో విరుచుకుపడింది.

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లోని (PoK) ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో విరుచుకుపడింది. ఈ వైమానిక దాడులపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) ఘాటుగా స్పందించారు. భారత్ది పిరికిపంద చర్య అని, పాక్ పౌరులు 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించారు. ఇండియాలో తామ ఎప్పుడు.. ఎక్కడ.. ఏం చేస్తామో చెప్పమని హెచ్చరించారు.
కాగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేసిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతో పాటు పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్టు చేశారు.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






