- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అత్యవసరమైతే ఆ అధికారాలు వినియోగించుకోండి.. అన్ని రాష్ట్రాల SCలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు

దిశ, వెబ్డెస్క్: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు(సీఎస్లకు) కేంద్ర హోంశాఖ(Union Home Ministry) లేఖ పంపించింది. అన్ని రాష్ట్రాలు సివిల్ డిఫెన్స్ చట్టంలో 11వ రూల్ వినియోగించాలని లేఖలో పేర్కొన్నారు. అత్యవసర పరికరాలు కొనేందుకు సీఎస్లకు అధికారం ఇచ్చారు. అవసరమైతే అత్యవసర అధికారాలు వినియోగించుకోవాలని సూచనలు చేశారు. మరోవైపు.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్టు, కూకట్పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్స్టేషన్, ట్యాంక్బండ్తో పాటు ఏపీలోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వేస్టేషన్, విజయవాడ బస్స్టాండ్, ఎంజీ రోడ్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ జోన్లో ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీ స్థాయి అధికారి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలోనే సూచనలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలని పోలీసులు చెబుతున్నారు.