భారత్ దూకుడుతో ఒక్కసారిగా మారిన సీన్.. యుద్ధంపై పాక్ యూటర్న్!

by Shiva |   ( Updated:2025-05-10 08:36:12.0  )
భారత్ దూకుడుతో ఒక్కసారిగా మారిన సీన్.. యుద్ధంపై పాక్ యూటర్న్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పాక్ డ్రోన్స్, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే దాయాదికి ఇండియర్ ఆర్మీ తన పవర్ ఏంటో చూపించింది.అందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున భారీ స్థాయిలో పాక్‌పై ప్రతిదాడికి దిగాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రధాన కేంద్రమైన రావల్పిండిని లక్ష్యంగా చేసుకుని భారత్ బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలక ఎయిర్ బేస్‌లను టార్గాట్‌గా చేసుకున్నాయి. రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్, షార్కోట్‌లోని రఫీకి ఎయిర్‌బేస్, చక్వాల్ సమీపంలోని మురిద్ ఎయిర్‌బేస్‌లపై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ దాడుల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ క్రమంలోనే భారత్ దూకుడుతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు తగ్గించుకుందామని పాక్ సంకేతాలు పంపుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా ఒత్తిడి, సొంత దేశంలో పౌరుల వ్యతిరేకత, భారత్‌కు పెరుగుతోన్న ప్రపంచ దేశాల మద్దుతుతో పాక్ యుద్ధంపై యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా హుటాహుటిన నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని కూడా రద్దు చేసుకుంది.



Next Story

Most Viewed