Pawan Kalyan: వీరజవాన్​ మురళి కుటుంబానికి రూ.25 లక్షలు.. ప్రకటించిన పవన్​కల్యాణ్​

by Thanuru Gopichand |

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో జవాన్​మురళినాయక్భౌ తిక కాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సందర్శించారు.

Pawan Kalyan: వీరజవాన్​ మురళి కుటుంబానికి రూ.25 లక్షలు.. ప్రకటించిన పవన్​కల్యాణ్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో జవాన్​మురళినాయక్​(Murali Naik) భౌతిక కాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సందర్శించారు. శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఎవరూ యుద్ధం కోరుకోలేదన్నారు. మన దేశాన్ని రక్షించుకునే క్రమంలో మురళినాయక్​మరణించాడని అన్నారు. యుద్ధం రావడానికి పాకిస్తానే కారణం అన్నారు. వారం కిందట పాకిస్తాన్​ఆర్మీ జనరల్​ఉగ్రవాదులను ప్రేరేపించే విధంగా మాట్టాడారని గుర్తు చేశారు. నాలుగు యుద్ధాలు చేసినా వారికి దాహం తీరలేదన్నారు. నిన్న సీజ్​ఫైర్​అన్న తర్వాత కూడా మళ్లీ బాంబుల దాడి చేశారని అన్నారు.

పాకిస్తాన్​ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. తర్వాత మూడు గంటల్లోనే సీజ్​ఫైర్​ను ఉల్లంఘించారని అన్నారు. టెర్రరిస్టులకు బలమైన గుణపాఠం చెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని తెలిపారు. తన సొంతగా రూ.25 లక్షలు మురళీ నాయక్​కుటుంబానికి ఇస్తానని ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీకి, రక్షణ రంగానికి అండగా ప్రజలు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి సత్యకుమార్​మాట్లాడుతూ మురళి నాయక్​పవన్​కల్యాణ్​వీరాభిమాని అని వెల్లడించారు. జోహార్​మురళి నాయక్​అంటూ నినాదాలు చేశారు.

Next Story