- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా కొనసాగుతున్న పాక్ దాడులు

దిశ, వెబ్డెస్క్: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పోరు కొనసాగుతోంది. కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేసి దాదాపు 100 మందిని హతమార్చింది. కాగా భారత్ చేసిన ఈ దాడికి ప్రతీకారంగా గురువారం సాయంత్రం నుంచి పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా చేసుకొని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడుదు చేసింది. కాగా ఈ దాడిని భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. రాత్రి మొత్తం సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ పరిస్థితులను శుక్రవారం తెల్లవారుజామున కూడా కొనసాగించింది.
ఈ రోజు తెల్లవారుజామున కూడా పాక్ దాడులకు తెగబడుతుండటంతో జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది. పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో స్థానిక ప్రభుత్వాలు పోలీసులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్, గుజరాత్ లలో రెడ్ సైరన్ మోగించారు. కాగా భారత్ లోని జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని..12 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేయగా భారత డిఫెన్స్ సిస్టం సమర్దవంతంగా అడ్డుకుంది. ముఖ్యంగా ఈ దాడులు పూంచ్, అర్నియా, అఖ్నూర్, సాంబా, గురేజ్, ఆర్ఎస్పురా, ఉదంపూర్, జమ్ము, పఠాన్కోట్, జలంధర్, పోఖ్రాన్, జైసల్మేర్లో జరిగాయి.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation