Pak PM Shehbaz : ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ ప్రధాని సంచలన ప్రకటన

by Muthe.Rajitha |   (  Updated:2025-05-07 18:04:40  IST  )

ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పేరుతో పాకిస్తాన్, POK లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మంది ముష్కరులను అంతం చేసిన సంగతి తెలిసిందే.

Pak PM Shehbaz : ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ ప్రధాని సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పేరుతో పాకిస్తాన్, POK లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మంది ముష్కరులను అంతం చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పాక్ ప్రధాని షెహబాజ్ సంచలన ప్రకటన చేశారు.


జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ.. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం అని భారత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులు ఇవ్వాలో పాక్ కు బాగా తెలుసునని అన్నారు. భారత దాడుల్లో చనిపోయిన దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని అన్నారు. పాక్ ప్రధాని చేసిన ప్రసంగం అనంతరం ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో అని ఆందోళనలు మొదలయ్యాయి.

Next Story