‘ఆపరేషన్ సిందూర్‌’ సూపర్ సక్సెస్.. అజిత్ దోవల్ రియాక్షన్ ఇదే!

by Kema Shiva Kumar |

పీవోకే, పాక్‌లో ఉన్న ఉగ్రవాదులే స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

‘ఆపరేషన్ సిందూర్‌’ సూపర్ సక్సెస్.. అజిత్ దోవల్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: పీవోకే, పాక్‌లో ఉన్న ఉగ్రవాదులే స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.భారత్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా వార్తలు తెలుస్తోంది. బవహల్పూర్‌‌ కేంద్రంగా జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యంలో ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ సిందూర్’‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ వేదికగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) స్పందించారు. ‘పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం క్షిపణి దాడి చేసింది. 8 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసం! పహల్గాంలో న్యాయం జరిగింది... భారత్ మాతా కీ జై! అంటూ అజిత్ దోవల్ ట్వీట్ చేశారు.

Next Story