- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మార్కో రూబియో ఫోన్.. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరిన వేళ ఇరుదేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇవాళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు ఫోన్ చేశారు. భారత్, పాక్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. రెండు దేశాలు కూర్చొని చర్చలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రెండు దేశాలకు మద్దతునిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే మార్కో రూబియోతో మాట్లాడిన కాసేపటికే సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘X’ వేదికగా జైశంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత్ వైఖరి ఎప్పుడూ శాంతియుతంగా, భాత్యతతో ఉంటుందని అన్నారు. ఇప్పటికీ తాము అలానే వ్యవహరిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జైశంకర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ దాడులు ఆపితే.. మేము ఆపుతాం: పాక్ కీలక ప్రకటన
భారత్పై వరుసగా దాడులకు పాల్పడుతోన్న పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. భారత్ దాడులు ఆపితే.. తాము కూడా ఆపుతామని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా స్పష్టం చేవారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఇవాళ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం జరగలేదని పేర్కొన్నారు. అవన్ని పుకార్లు మాత్రమేనని.. కావాలనే భారత్ తమపై దుష్ప్రచారం చేస్తోందని ఖవాజా కొట్టిపడేశారు.