India-Pakistan tension: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-05-10 07:33:58.0  )
India-Pakistan tension: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ సైనికులు(Pak Syniks) చేస్తున్న డ్రోన్స్(Drones), మిసైల్(Missiles) దాడులను సమర్థంతంగా ఎదుర్కొంటోంది. ఎక్కడికక్కడ ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ(Indian Army)కి అన్ని దేశాల నుంచి మద్దతు పెరిగింది. తాజాగా మహారాష్ట్ర(Maharastra) సైతం మద్దతు తెలిపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Cm Devendra Fadnavis) పుణేలో మీడియాలో మాట్లాడారు.

‘‘పాకిస్థాన్ అనేది ఉగ్రవాద దేశం. అది ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటుంది. భారత ఆర్మీని చూసి గర్విస్తున్నాం. యుద్ధం వస్తే ఇండియా వెనక్కి తగ్గదు. ప్రధాని మోదీ సత్తా ఉన్న లీడర్. ఆయన ఆధ్వర్యంలో అందరం ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ విషయం ఇప్పటికే చెప్పాం. యుద్ధం వస్తే ఏంటనే పరిస్థితులపై అధికారులతో చర్చించాం. అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు సూచించాం.’’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed