తుపాన్‌లా విరుచుకుపడుతున్న త్రివిధ దళాలు.. పాకిస్తాన్‌కు ఇదే చివరి రాత్రా?

by Gantepaka Srikanth |

పాకిస్తాన్‌(Pakistan) దుశ్చర్యతో చిర్రెత్తిన భారత సైన్యం రెచ్చిపోతోంది.

తుపాన్‌లా విరుచుకుపడుతున్న త్రివిధ దళాలు.. పాకిస్తాన్‌కు ఇదే చివరి రాత్రా?
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌(Pakistan) దుశ్చర్యతో చిర్రెత్తిన భారత సైన్యం రెచ్చిపోతోంది. పాకిస్తాన్‌కు భారత్(India) దెబ్బ రుచి చూపించడమే లక్ష్యంగా ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాక్‌లోని పెషావార్, లాహోర్, ఇస్లామాబాద్, సియోల్‌కోట్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పాకిస్తాన్‌పై ఎటాక్ వేళ దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఏ క్షణం ఏం జరగుతుందో తెలియదని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచనలు చేశారు.

Next Story