- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత్ దాడి ఎఫెక్ట్.. పాకిస్తాన్లోని ఆ ప్రాంతంలో భారీ గుంత!?

దిశ,వెబ్డెస్క్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. పాక్ సైనికులు చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఎక్కడికక్కడ ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంటుంది. ఈ క్రమంలో పాక్ దుందుడుకుతనానికి ప్రతీకారంగా భారత్ ప్రయోగించిన క్షిపణి అక్కడి పంజాబ్(Panjab)లోని రహీమైర్ ఖాన్ వాయు స్థావరాన్ని పాక్షికంగా ధ్వంసం చేసినట్లు సమాచారం. రన్ వే పై క్షిపణి పడిన చోట భారీ గుంత ఒకటి ఏర్పడింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు పాకిస్తాన్కు భారత్ ధీటుగా జవాబిచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను సీరియస్గా తీసుకున్న భారత్.. పాక్ ఉగ్రమూకల స్థావరాలపై ఈ నెల 7న ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో భారత్ పలు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ విధించింది.