- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాజస్థాన్లో భారీ మిసైల్.. గాల్లోనే ధ్వంసం చేసి శిథిలాలు స్వాధీనం

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆర్మీ(Pakistan Army) యత్నించింది. ఆ రాష్ట్రంలోని ప్రాంతాలపై క్షిపణులను ప్రయోగించింది. అయితే భారత జవాన్లు(Bharat Syniks) వాటిని దీటుగా అడ్డుకున్నారు. ఆకాశ మార్గంలోనే ధ్వంసం చేశారు. దీంతో ఆ శిథిలాలు కింద పడ్డాయి. ఈ మేరకు పరిశీలించి వాహనాల్లో తీసుకెళ్లారు. రాజస్థాన్లో బార్మర్, జైసల్మేర్, పోఖ్రాన్ మిసైల్స్ శకాలను గుర్తించారు. వాటిని సైతం స్వాదీనం చేసున్నారు. ఈ వీడియోలను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
కాగా పహల్గాం దాడి తర్వాత పాక్, భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. 25 మంది భారతీయులను పొట్టన పెట్టుకోవడం భారత ప్రభుత్వం సీరియస్ అయి పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఈ చర్యలను జీర్ణించుకోలేని పాకిస్థాన్ సైన్యం.. భారత్తో యుద్ధానికి సిద్ధమంటూ దుశ్చర్యకు దిగింది. భారత సరిహద్దు ప్రాంతాల పౌరులే లక్ష్యంగా డ్రోన్స్, మిసైల్స్, ఇతర మందు గుండు సామాగ్రితో దాడులకు దిగింది. దీంతో భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. పాక్ పంపిన ప్రతి పేలుడు పదార్థాలను గాల్లోనే ధ్వంసం చేస్తున్నాయి. వాటి శిథిలాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్లో లభ్యమైన శిథిలాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.