అదే రోజున భీకర యుద్ధం.. సంచలనం సృష్టిస్తున్న పండితుడి సోషల్ మీడియా పోస్ట్

by Sujitha Rachapalli |   ( Updated:2025-05-09 08:27:50.0  )
అదే రోజున భీకర యుద్ధం.. సంచలనం సృష్టిస్తున్న పండితుడి సోషల్ మీడియా పోస్ట్
X

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతోంది. భారత్ పాక్‌పై విరుచుకుపడుతుంది. లంకను కాపాడిన హనుమంతుడే ఈ ఆపరేషన్‌కు మార్గదర్శకమని ప్రకటించింది భారత ప్రభుత్వం. రాత్రి నుంచి దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ పండితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఆయన ఇండియా వార్‌లో పాల్గొనబోతుందని చెప్పాడు.

అవును.. స్వామి యోగేశ్వరానంద గిరి ఓ పాడ్ కాస్ట్‌లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా వివరించాడు. మే 30న ఆరు గ్రహాలు ఒకే కక్ష్యలోకి రాబోతున్నాయని.. ఈ సమయంలోనే మహాభారతంలో కురుక్షేత్రం లాంటి యుద్ధాలు జరిగాయని తెలిపాడు. ఈ సమయంలో ఇండియా వార్‌ చేయబోతుందని చెప్పాడు. ఇది తాను చెప్తుంది కాదని.. మీరు కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చని తెలిపాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు భీకర యుద్ధం జరిగితే గెలిచేది మనమే అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సారి పాకిస్తాన్ నామ రూపం లేకుండా పోతుందని అంటున్నారు.

Click For Tweet..



Next Story

Most Viewed