- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Breaking:ఇండియా–పాక్ యుద్ధం ఎఫెక్ట్.. భారత్ సంచలన నిర్ణయం

దిశ,వెబ్డెస్క్: పహల్గాం ఉగ్రదాడి ఘటనను సీరియస్గా తీసుకున్న భారత్.. పాక్ ఉగ్రమూకల స్థావరాలపై ఈ నెల 7న ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో భారత్ పలు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ విధించింది. గత రెండు రోజుల నుంచి పాకిస్థాన్ మళ్లీ భారత్పై దాడులకు యత్నించింది.
పాక్ సైనికులు చేస్తున్న డ్రోన్, మిస్సైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. భారత్ తిప్పికొట్టింది. వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంటుంది. ఈ తరుణంలో వరుస ఉద్రిక్తతల వేళ భారత ప్రభుత్వం టెర్రరిజంపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానిని దేశం పై యుద్ధంగానే పరిగణిస్తామని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకు తగినట్లుగానే స్పందిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.