ఢిల్లీలో హైఅలర్ట్.. ప్రజలెవరూ బయట తిరగొద్దని హెచ్చరిక

by Gantepaka Srikanth |

భారత్(India) - పాకిస్తాన్‌(Pakistan)ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది.

ఢిల్లీలో హైఅలర్ట్.. ప్రజలెవరూ బయట తిరగొద్దని హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్‌(Pakistan)ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం హైఅలర్ట్(High alert in Delhi) ప్రకటించింది. ప్రజలు ఎవరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేసింది. భారత్ - పాక్ ఆర్మీల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో రంగంలోకి ఇండియన్ నేవి దిగింది. మరోవైపు క్షిపణులతో పాకిస్తాన్ దాడులకు తెగబడగా.. భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఎనిమిది క్షిపణులను కూల్చినట్లు రక్షణవర్గాల వెల్లడించాయి. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్‌ పురా, అర్నియా సెక్టార్లతో పాకిస్తాన్‌ దాడులను సమర్థంగా భారత సైన్యం తిప్పికొట్టింది.

Next Story