పాక్‌పై కన్నెర్ర చేసిన ప్రకృతి.. భార‌త్ పాక్ ఉధ్రిక్త‌త‌ల మ‌ధ్య మ‌రోదెబ్బ‌

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ ఉధ్రిక్త‌త‌ల మ‌ధ్య దాయాది దేశానికి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది.

పాక్‌పై కన్నెర్ర చేసిన ప్రకృతి.. భార‌త్ పాక్ ఉధ్రిక్త‌త‌ల మ‌ధ్య మ‌రోదెబ్బ‌
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ ఉధ్రిక్త‌త‌ల మ‌ధ్య దాయాది దేశానికి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఓవైపు ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తుంటే మ‌రోవైపు బలుచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ సైతం పాకిస్థాన్ పై పోరాటం చేస్తుంది. ఇప్పుడు పాకిస్థాన్ కు మ‌రో ముప్పు పొంచి ఉంది. జ‌మ్మూలో అకాల వ‌ర్షాల‌తో న‌దుల్లో నీటి ప్రవాహం పెరిగిపోయింది.

సింధూనది ఉప‌న‌ధి అయిన చినాబ్ లో నీటి ప్ర‌వాహం పెరిగిపోయింది. దీంతో మూసివేసిన స‌లాల్, బాగ్లీహ‌ర్ డ్యాముల రెండు గేట్ల‌ను ఎత్తివేశారు. దీంతో ఒక్క‌సారిగా నీటి ప్ర‌వాహం పోటెత్తింది. దీంతో పాకిస్థాన్ లోని లోత‌ట్టు ప్రాంతాల‌క వ‌ర‌ద ముప్పు పొంచి ఉంది. ఇదిలా ఉంటే ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న త‌ర‌వాత ఉగ్ర‌వాదుల‌ను పెంచిపోశిస్తున్న పాకిస్థాన్ కు బుద్ది చెప్పేందుకు భారత్ సింధూ న‌ది జ‌లాల‌ను ఆపేసింది. ఇప్పుడు డ్యామ్ నిండిపోవ‌డంతో ఒకేసారి గేట్ల‌ను ఎత్తివేసింది.

Next Story