- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాకిస్తాన్కు బిగ్ షాక్.. ఓ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న BLA?

దిశ,వెబ్డెస్క్: భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ సైనికులు చేస్తున్న డ్రోన్స్, మిసైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఎక్కడికక్కడ ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంటుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్లో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా తన చర్యను ముమ్మరం చేసింది.
తాజాగా బలూచిస్థాన్ ప్రావిన్స్లో 39 వేర్వేరు ప్రదేశాలపై BLA దాడి చేసిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆ దేశ సైనికులకు చుక్కలు చూపెడుతుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బలగాలను హతమార్చింది. ఈ క్రమంలో కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మిలిటరీ కాన్వాయ్లను అటాక్ చేస్తామని హెచ్చరించింది. కాగా ప్రత్యేక దేశం డిమాండ్తో BLA పోరాడుతుంది. మా ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని BLA ప్రకటించింది. ఈ ఆపరేషన్ సమయంలో ప్రధాన రహదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాగే, పాకిస్తాన్ పోలీస్ స్టేషన్లు, పాకిస్తాన్ సైన్యం మరియు వారి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు.