నిజామాబాద్‌లో కారు బీభత్సం… ఒకరు మృతి

by  |
నిజామాబాద్‌లో కారు బీభత్సం… ఒకరు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఒక కారు డ్రైవర్ వీరంగం సృష్టించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్‌లో తాగిన మత్తులో ఉన్న వ్యక్తి కార్‌ను రాష్‌గా నడిపి నిఖిల్ సాయి చౌరస్తా వద్ద రెండు బైకులను ఢీ కొట్టి, దగ్గర్లోని వైన్‌ షాపులోకి చొచ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో శుక్రవారం రాత్రి జరిగింది.

ఈ ఘటనలో వెంకటేష్ అనే యువకుడు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాగి కారు నడపడం మూలగానే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం కారు డ్రైవ్ చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వెంకటేష్ రోటరీ నగర్ వాసిగా తెలిసింది.



Next Story

Most Viewed