అత్తారింటి నుంచి వస్తూ అనంతలోకాలకు

by  |
అత్తారింటి నుంచి వస్తూ అనంతలోకాలకు
X

దిశ‌, డోర్నక‌ల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘ‌ట‌న దంతాల‌ప‌ల్లి మండ‌లంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. న‌ర్సింహులపేట మండ‌లం ప‌డ‌మ‌టి గూడెం గ్రామానికి చెందిన నిమ్మల న‌రేష్‌(25) ఆదివారం ఉదయం అత్తారింటి నుంచి బైక్‌పై తిరుగు ప‌య‌ణ‌మయ్యాడు. ఈ క్రమంలో దంతాల‌ప‌ల్లి మండ‌లం రామానుజ‌పురం గ్రామ శివారులోని మిష‌న్‌ భ‌గీర‌థ పైపులైన్ వాల్ దిమ్మెను బైక్ ఢీ కొట్టడంతో అక్కడిక‌క్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేర‌కు పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed