భార్య పిల్లల ముందే భర్త మృత్యువాత

by  |
భార్య పిల్లల ముందే భర్త మృత్యువాత
X

దిశ ప్రతినిధి,నిజామాద్: భార్య పిల్లలతో కలిసి బైక్ పై వెళుతున్న వ్యక్తిని రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది.లారీ, టీవీఎస్ బైక్ ను ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో నగరం లోని సుభాష్ నగర్ చెందిన అర్జున్ మృతి చెందాగా అతని భార్య చింతల లక్ష్మి, కుమారులు సాంబయ్య (7),సారలయ్య (4) గాయపడ్డారు . ఏడపల్లి పోలీస్ లు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed