సింగరేణి డంపర్ ఢీకొని ఒకరు మృతి

by  |
సింగరేణి డంపర్ ఢీకొని ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి డంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. గడ్డిగానిపల్లిలో అదుపుతప్పి ఓ వ్యక్తిపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జడల లింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్‌లోకి చొరబడి పలు వాహనాలు, ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు గ్రామస్తులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story